ఆంధ్రుల ఆశాజ్యోతిగా ఆత్మగౌరవ చిహ్నంగా ప్రజా రాజధాని అమరావతిలో ఉండాలన్న ఏకైక లక్ష్యంతో మొదలైన పోరాటం ఎందరికో స్పూర్తిదాయకం. భూమి పుత్రులు మొదలు పెట్టిన ఈ ఉద్యమం ఆంధ్ర జాతిని మేల్కొలిపింది.
ఈ అమరావతి ఉద్యమం కుల మత ప్రాంతాలకుఅతీతంగా ఊరు వాడలను ఏకంచేసింది. ఆంధ్రుల ఆవేశం ఆరంభ శూరత్వం మాత్రమే అనే పాత నానుడికి అమరావతి లో జరుగుతున్న ఈ మహాఉద్యమం పాతర వేసింది. అప్రజాస్వామిక నిరంకుశ పోకడలకు ఎదురొడ్డి అడ్డుకట్ట వేసింది. బెజవాడ కనకదుర్గ ఆనతో నడుము కట్టిన నారీలోకం ఆత్మగౌరవ పోరాటంలో శంఖారావం పూరించి అగ్రభాగాన నిలిచి పొరాడు తున్నది. రాజ్యహింస చేసిన గాయాలతో మానసిక వేదనతో అసువులు బాసిన అరవై మంది అమరుల ఆత్మసాక్షిగా అహింసా మార్గంలో గాంధేయ స్ఫూర్తిగా బడుగు,బలహీన వర్గాల రైతులు కూలీలు,విద్యార్థులు, మేధావులతో సాగుతున్న ఈ ఉద్యమం విజయం సాధించి చరిత్ర పుటలలో నిలిచి పోతుంది. భావి పోరాటాలకు స్ఫూర్తిగా ఉంటుంది.
మోసం అనేది చాలీచాలని దుప్పటిలాంటిది. తల కప్పుకుంటే కాళ్లు, కాళ్లు కప్పుకుంటే తల కనిపిస్తుంది. అభివృద్ధికి అధికార వికేద్రీకరణ అంటూ చాలీచాలని దుప్పట్లో దూరిన పాలక నేతలు మూడు రాజధానులు పేరుతో పలుకుతున్న అబద్దాలు, అర్ద సత్యాలు,ఆడుతున్న రాజకీయనాటకాలు పాలకుల నైజాలను, నగ్నత్వాన్ని నలుచెరుగులా బహిర్గతం అయింది. బాధ్యత లేని లేకి చేష్టలతో,వెకిలి మాటలతో ఉద్యమ ఊపిరి తీద్దామన్న వెర్రి వెదవలకు వాస్తవం బోదించింది. భూమికి కులం అంటగట్టిన గజ్జి గాళ్ళకు మాది రైతుకులం అని మాడు పగలగొట్టింది. చట్టాలను చుట్టాలచేతుల్లో పెట్టి చంకలు గుద్దుకున్న చవటలకు ధర్మాసనం చెవులు పిండి బుద్దిచెప్పింది. అంతరజాతీయా ప్రమాణాలతో అద్భుతంగా అజారామంగా ఉండవలిసిన అమరావతిని మురికివాడగా మార్చాలనుకున్న అంట్లవెధవల మురికి ఆలోచనలకు ముక్కుతాడు వేసింది. కండ బలం,కాసుల బలం కంటే జనబలం మిన్న అని ఉద్యమాల చరిత్ర చూస్తే తెలుస్తుంది.
ఇసుక నుండి నూనె తీయవచ్చు, కుందేలు కొమ్ము తేవచ్చు గాని మూర్గుని మనసు మెప్పించలేమని పెద్దల మాట. కానీ ఇది రాజరిక వ్యవస్థ కాదు, నియంతలకు,జనాంతకులకు చోటు లేదు. ప్రజాస్వామ్యం లో ప్రజలే ప్రభువులు వారి మాటే శిరోధార్యం అన్న ఇంగిత జ్ఞానం పాలకులకు బోధపడే వరకు అమరావతి ఉద్యమం కొనసాగుతుంది. ఆంధ్రజాతి భవిషత్ కొరకు జరిగే ఈ ఉద్యమం అన్ని ఆటుపోట్లను ఎదిరించి విజయం సాధిస్తుంది. ఇది అక్షర సత్యం.
జై అమరావతి ... జై ఆంధ్ర ప్రదేశ్
ఆచార్య కొడాలి శ్రీనివాస్.
Comments