Skip to main content

అలుపెరుగని అమరావతి పోరాటం

ఆంధ్రుల ఆశాజ్యోతిగా ఆత్మగౌరవ చిహ్నంగా ప్రజా రాజధాని అమరావతిలో ఉండాలన్న ఏకైక లక్ష్యంతో మొదలైన పోరాటం ఎందరికో స్పూర్తిదాయకం. భూమి పుత్రులు మొదలు పెట్టిన ఈ ఉద్యమం ఆంధ్ర జాతిని మేల్కొలిపింది.

ఈ అమరావతి ఉద్యమం కుల మత ప్రాంతాలకుఅతీతంగా ఊరు వాడలను ఏకంచేసింది. ఆంధ్రుల ఆవేశం ఆరంభ శూరత్వం మాత్రమే అనే పాత నానుడికి అమరావతి లో జరుగుతున్న ఈ మహాఉద్యమం పాతర వేసింది. అప్రజాస్వామిక నిరంకుశ పోకడలకు ఎదురొడ్డి అడ్డుకట్ట వేసింది. బెజవాడ కనకదుర్గ ఆనతో నడుము కట్టిన నారీలోకం ఆత్మగౌరవ పోరాటంలో శంఖారావం పూరించి అగ్రభాగాన నిలిచి పొరాడు తున్నది. రాజ్యహింస చేసిన గాయాలతో మానసిక వేదనతో అసువులు బాసిన అరవై మంది అమరుల ఆత్మసాక్షిగా అహింసా మార్గంలో గాంధేయ స్ఫూర్తిగా బడుగు,బలహీన వర్గాల రైతులు కూలీలు,విద్యార్థులు, మేధావులతో సాగుతున్న ఈ ఉద్యమం విజయం సాధించి చరిత్ర పుటలలో నిలిచి పోతుంది. భావి పోరాటాలకు స్ఫూర్తిగా ఉంటుంది. 
మోసం అనేది చాలీచాలని దుప్పటిలాంటిది. తల కప్పుకుంటే కాళ్లు, కాళ్లు కప్పుకుంటే తల కనిపిస్తుంది. అభివృద్ధికి అధికార వికేద్రీకరణ అంటూ చాలీచాలని దుప్పట్లో దూరిన పాలక నేతలు మూడు రాజధానులు పేరుతో పలుకుతున్న అబద్దాలు, అర్ద సత్యాలు,ఆడుతున్న రాజకీయనాటకాలు పాలకుల నైజాలను, నగ్నత్వాన్ని నలుచెరుగులా బహిర్గతం అయింది. బాధ్యత లేని లేకి చేష్టలతో,వెకిలి మాటలతో ఉద్యమ ఊపిరి తీద్దామన్న వెర్రి వెదవలకు వాస్తవం బోదించింది. భూమికి కులం అంటగట్టిన గజ్జి గాళ్ళకు మాది రైతుకులం అని మాడు పగలగొట్టింది. చట్టాలను చుట్టాలచేతుల్లో పెట్టి చంకలు గుద్దుకున్న చవటలకు ధర్మాసనం చెవులు పిండి బుద్దిచెప్పింది. అంతరజాతీయా ప్రమాణాలతో అద్భుతంగా అజారామంగా ఉండవలిసిన అమరావతిని మురికివాడగా మార్చాలనుకున్న అంట్లవెధవల మురికి ఆలోచనలకు ముక్కుతాడు వేసింది. కండ బలం,కాసుల బలం కంటే జనబలం మిన్న అని ఉద్యమాల చరిత్ర చూస్తే తెలుస్తుంది. 
ఇసుక నుండి నూనె తీయవచ్చు, కుందేలు కొమ్ము తేవచ్చు గాని మూర్గుని మనసు మెప్పించలేమని పెద్దల మాట. కానీ ఇది రాజరిక వ్యవస్థ కాదు, నియంతలకు,జనాంతకులకు చోటు లేదు. ప్రజాస్వామ్యం లో ప్రజలే ప్రభువులు వారి మాటే శిరోధార్యం అన్న ఇంగిత జ్ఞానం పాలకులకు బోధపడే వరకు అమరావతి ఉద్యమం కొనసాగుతుంది. ఆంధ్రజాతి భవిషత్ కొరకు జరిగే ఈ ఉద్యమం అన్ని ఆటుపోట్లను ఎదిరించి విజయం సాధిస్తుంది. ఇది అక్షర సత్యం. 
జై అమరావతి ... జై ఆంధ్ర ప్రదేశ్ 
ఆచార్య కొడాలి శ్రీనివాస్. 

Comments

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని  అవగాహనారాహిత్యం  అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాల

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధి పోరాటాలకు ది

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ఉండటం కనిపిస్తుంది.  చరిత్ర