Skip to main content

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు. 

ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. 
కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధి పోరాటాలకు దిగటంలో విజ్ఞత లేదు. మతం పేరుతో రచ్చచేసే వారి మాటలకు విలువ లేదు. అలాగే ఆగమ శాస్త్రాల ప్రకారం శిధిలమైన దేవాలయాలను తొలగించవచ్చు లేక జీర్ణోద్ధారణ పేరుతో తిరిగి కట్టుకోవచ్చు. 
అభివృద్ధికి ఆటంకం కల్పిస్తూ సంఘానికి, సమాజానికి అసౌకర్యాన్ని  కల్పించే అనేక వీధి ప్రార్ధనా మందిరాలను, నేతల విగ్రహాలను రోడ్లపై ప్రతి చోట మనం గమనించుతున్నదే. రహదారులు రాక పోకలకు మాత్రమే నన్న ఇంగిత జ్ఞానం కొరవడి, పంతాలు పట్టింపులకు పోయి మనకు మనమే కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాం. 
వాస్తు శాస్త్రంలో దేవాలయాలు నిర్మించటానికి అనువైన ప్రదేశాల గురించి నిర్దిష్టమైన మార్గ దర్శకాలు వున్నాయి. ప్రశాంత ప్రదేశాలలో, అసౌకర్యం కలుగకుండా వీటిని నిర్మించుకోవాలి. దేవాలయ వాస్తు ప్రకారం వీధుల్లో అడ్డంగా గుడులు/ఆలయాలు కట్టరాదు. వాస్తులో ఏ దేవాలయం ఏ దిశలో ఎక్కడ ఉండాలో,దాని పరిసరాల్లో జనావాసాలు ఎంత దూరంలో ఉండాలో చెప్పారు. గుడి చుట్టూ ప్రదక్షిణాలకు తగినంత ఖాళీ ప్రదేశం వదలి తీరాలి. అపరిశుభ్ర ప్రదేశాలలో, జనావాసాల మధ్య వీటిని నిర్మించరాదు. ధ్వజ స్తంభం, బలి పీఠం, రాజ గోపురం లేని దేవాలయాలు పరిపూర్ణత లేని దేవాలయాలుగా పరిగణించ బడతాయి. ఈ జ్ఞానం వీధుల్లో గుడి కట్టే వారికి కాని, దాన్ని బలపరిచే/ప్రోత్సహించే వారికి కాని లేక పోవటం ఈ దేశ దౌర్భాగ్యం. మతానికి ఊతం మందిరం అనే సాధు పుంగవులు, స్వయంభువ స్వామీజీలు, రాజకీయ సన్యాసులు స్వార్థపరుల చేతిలో కీలుబొమ్మలుగా మారి వీధి రాజకీయాలలో తలదూర్చటం నైతిక దిగజారుడు తనం . 
ఒక మతం వారిని చూచి వేరొక మతం వారు ఇలా వీలునుబట్టి వీధులను ఆక్రమించుకోవటం, ఆక్రమణలతో రోడ్లపై పెత్తనం చేయటం ఈ నాడు నిత్య కృత్యంగా మారింది. 
వీధుల్లో, ప్రభుత్వ స్థలాల్లోప్రజలకు ఇబ్బంది కలిగించేలా నిర్మించే ప్రార్ధనా మందిరాలకు, విగ్రహాలకు అనుమతి ఇవ్వరాదని సుప్రీం కోర్ట్ ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ దానిని పెడచెవిని పెట్టటం దివాలాకోరు రాజకీయం. దేవుణ్ణి అడ్డం పెట్టి రోడ్డుపై వ్యాపారం చేసే ఈ అవాంచనీయ పోకడలకు అడ్డు కట్ట వేసే దిశగా పాలకులు సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలి. 
వీధికి అడ్డంగా రాకపోకలకు అసోకర్యంగా రోడ్లపై బొగ్గుతో దేవుని బొమ్మ వేసి, వాటికి రంగులు పూసి ప్రదర్శించే కళాకారులు ఉన్నారు. వీటిపై సాయంత్రానికి విసిరిన చిల్లర డబ్బులు ఏరుకునే ధూళి చిత్రకారులే ఈ బాపతు జనం కంటే నయం. కళాత్మకంగా ఉదయం గీసిన దేవుళ్ళ బొమ్మలు సాయంత్రానికి తుడిపెస్తారు.
ఇప్పటికే రోడ్లకు అడ్డంగా శాస్వితంగా ఉండేలా నిర్మించిన మత మందిరాలను విశ్వాసుల మనో భావాలకు భంగం కలుగుతుందన్న సాకుతో వాటి జోలికి వెళ్లకపోవటం కూడా న్యాయ ధిక్కారం క్రిందికే వస్తుంది. వాటిని తప్పనిసరిగా తొలగించాలి. ఇలాంటి విషయాలలో ఉపేక్షించితే కొన్నాళ్ళకు నడవటానికి దారులే మిగలవు. 
ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వేచ్చకు భంగం చేయటం, మతం పేరుతొ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించటం, హింసించటం శిక్షార్హం. వ్యక్తిగత మత విశ్వాసాలను అందరిపై రుద్దటం, తమ స్వార్ధం కొరకు మతాన్ని పావుగా వాడుకోవటం ఈ నాడు చాలా మామూలు విషయంగా తయారైయింది. ఈ పెడదోరణి మారాలి. 
గుడి, మసీదు, దర్గా, చర్చి అది ఏదైనా, దాని వెనుకున్న మతమేదైనా కానివ్వండి... వీధి/దారికి ఆటంకం కలిగించే అన్ని ప్రార్ధనా మందిరాలను తొలగించటానికి ప్రతి మతం వారు సహృదయంతో సహకరించాలి.వీలును బట్టి వేరే చోట నిర్మించుకోవచ్చు. ప్రభుత్వంపై వత్తిడి తేవటం సరి కాదు.  అలాగే చికాకు కలిగేలా రోడ్ల కూడలిలో, మధ్యలో విచ్చలవిడిగా ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలు తొలగించాలి. 
సిద్ధాంత రాద్ధాంతాల ముసుగులో మందిరాలకు మద్దతుగా మత, కుల, వర్గ, ప్రాంత ద్వేషాలు రాజేసే రాజకీయ నిరుద్యోగులు పన్నే ఉచ్చులో పడకుండా హేతుబద్దంగా ఆలోచించాలి. సమాజ పునర్నిమాణమంలో హేతుబద్ధ ఆలోచనలతో అందరూ సహకరించాలి.  

Comments

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని  అవగాహనారాహిత్యం  అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాల

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ఉండటం కనిపిస్తుంది.  చరిత్ర