Skip to main content

అమరావతి - ఆవశ్యకత - 6

సమస్యలు చుట్టుముట్టినపుడు , అజ్ఞానం రాజ్యమేలుతున్నప్పుడు మేధావుల మౌనం సమాజానికి చేటు చేస్తుంది. మంచి ఎదో చెడు ఎదో తెలియజేయవలిసిన బాధ్యత ఉంటుంది. సమస్యను పరిష్కారం చేయలేనప్పుదు దాన్ని గజిబిజి చేసి ప్రజలను గందరగోళంలోకి నెట్టే పరిపాలకులకు దశా దిశా నిర్దేశం చూపించాలి. తెలుగు వారి క్షేమం,అభివృద్ధి కోరేవారు అమరావతి రాజధానిపై స్పందించాలి.

1. మంచికో చెడుకో అమరావతిలో నూతన రాజధాని ఉండాలని స్థూలంగా అన్ని పక్షాలు ఒప్పుకున్నాయి. ప్రణాళికలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాప్రదేశం ఎంపికలో ఏకాభిప్రాయం ఉంది. దేశ నలుమూలల నుండి పవిత్ర జలాలు, పుట్ట మన్ను తెచ్చి ప్రదేశాన్ని శుద్ధి పరిచి, పెద్దలందరి సమక్షంలో ప్రధాని స్వహస్తాలతో అమరావతికి శంఖు స్థాపన చేశారు. రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు, ప్రజా ఆమోదంతో మొదలు పెట్టిన పనికి అందరు నిబద్దతతో కట్టుబడి ఉండాలి. అంత్య నిష్టురం కన్నా ఆది నిష్టురం మేలు అని ఆనాడు అంగీకరించి మౌనంగా ఉన్న వ్యక్తులు ఈనాడు ఆక్షేపించటం సరికాదు.


2. రైతుల నుండి సమీకరించబడ్డ భూమిని తిరిగి యధాస్థితికి తెచ్చి వారికి ఇవ్వటం ఇప్పుడు అసాధ్యం. రైతులకు వచ్చిన స్థలాలు కొన్ని అమ్మకాలు కూడా జరిగాయి. కొంత భూమిలో ఇప్పటికే చాలా భవనాలు నిర్మించారు. తాత్కాలిక పాలనా సౌలభ్యం కొరకు వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం, రాష్ట్ర శాసన సభ, శాసన మండలికి 6 లక్షల చదరపు అడుగుల తో ఆరు శాశ్విత భవనాలు నిర్మించారు. భవనాలు తరువాత ఇతర అవసరాలకు వినియోగించే ఉద్దేశంతో వీటిని నిర్మించారన్న విషయం తెలిసికూడా అసత్యలు వ్యాప్తి చేసే వారి ఉద్దేశం గ్రహించండి. అలాగే వీటి నిర్మాణానికి అయినా ఖర్చు చదరపు అడుగు Rs 3350/- మాత్రమే. వీటి ఖర్చు పై చేసే వాదనలలో వాస్తవాలు లేవు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కొరకు విలువైన 850 ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు కూడా అమరావతిలో స్థలాలు ఇచ్చారన్న విషయం మననం చేసుకోవాలి.
అమరావతిలో ఇల్లు ఉండాలని భావిస్తూ ప్రపంచ వ్యాప్తంగా 1250 మంది తెలుగువారు హ్యాపీ నెస్ట్ లో అపార్ట్ మెంట్స్ కొరకు ముందస్తు చెల్లింపులు చేశారు. అలాగే 500 కోట్లతో కట్టే NRIT భవనంకు ప్రణాళిక రూపొందించి నిర్మాణం కొరకు వేచి ఉంది. వీరందరికి ఏమి సమాధానం చెబుతారు.






3. నేలపాడులో రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం కొరకు రెండు లక్షల ఇరువది వేల చదరపు అడుగుల తో (జి+2) భవనం నిర్మించారు. 160 కోట్ల రూపాయలతో పటిష్టంగా నిర్మించిన ఈ భవనం కూడా శాశ్విత భవనమే. రాజసం ఉట్టిపడేలా అద్భుతంగా రూపకల్పన చేసి పునాది స్థాయిలో నిర్మాణంలో ఉన్న హైకోర్టు భవనం పూర్తి అయినా తరువాత ఇది నగర న్యాయాలయంగా సేవలందిస్తుంది. న్యాయమూర్తుల నివాసాలు నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది.
4.ప్రఖ్యాత చెందిన మూడు విశ్వ విద్యాలయాలలో VIT, SRM. రెండు నిర్మాణాలు పూర్తి చేసుకొని తరగతులను కూడా ప్రారంభిచాయి.
శాసన సభ్యులకు, ఉన్నత అధికారులకు, సెక్రెటియేట్ ఉద్యోగులకు నివాసాలు దాదాపు పూర్తి కావచ్చాయి. అంతర్గత రహదారుల నిర్మాణం మొదలైంది.
5. తిరుమల దేవస్థానం వారిచే ఆగమ శాస్త్ర రీతిలో 135 కోట్లతో నిర్మించే అద్భుతమైన శ్రీ వారి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగి నిర్మాణం మొదలైంది. దాన్ని కుదించి 35 కోట్లతో సాధారణ దేవాలయ స్థితికి మార్చటం దైవ ద్రోహం.


5.యాభై పైగా కేంద్ర రంగ సంస్థలతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలకు వారి అవసరాల కొరకు భూకేటాయింపులు జరిగాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చితే అమరావతికి ఒక రూపు సంతరించుకుంటుంది. ఎందరికో ఉపాధి కలుగుతుంది.
అమరావతి మొదటి దశ నిర్మాణానికి దాదాపు 50 వేల కోట్లు అవుతాయి అన్నది ఒక అంచన, ఇప్పటికే 40 వేల కోట్లకు పనులకు టెండర్లు ఇచ్చారు, దాదాపు తొమ్మిది వేల కోట్లు ఖర్చు అయింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1500 కోట్లు, అమరావతి బాండ్లు పేర షేర్ మార్కెట్లో తెచ్చిన 2000 కోట్లు కూడా ఉన్నాయి. మిగిలిన పెట్టుబడికి ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. పెట్టుబడి దారులలో విశ్వసనీయతను పోగొట్టేలా విశ్వసనీయతకు మారుపేరుగా చెలామణి అయ్యేవారు ప్రవర్తించటం శోచనీయం.
వివేకం లోపించినవారు, విచక్షణ లేనివారు, లోపాయికారి ఆలోచనతో చేసే అరాచక, అహంకారపూరిత పనులకు అడ్డుకట్ట వేయాలి. అమరావతి నగర నిర్మాణాన్నిఅర్దఅంతరంగా ఆపివేయాలనే పిచ్చి నిర్ణయాన్ని వదిలివేయాలని ప్రభుత్వంపై వత్తిడి తేవాలి. ప్రజల మనోగతికి విరుద్ధంగా రాజధాని కమిటీ వేయటం తాగనిపని. అభిప్రాయ సేకరణ పేరుతో శర వేగంగా సాగుతున్న అమరావతి నిర్మాణానికి సైన్ధవులుగా అడ్డపడే వారిని చరిత్ర క్షమించదు. స్వలాభంతో, అసూయ ద్వేషాలతో అమరావతిని అడ్డుకొంటే జాతి ద్రోహులుగా నిలిచిపోతారు. పంతాలు,పగలు వదిలి రాజకీయ విజ్ఞతను చూపండి.
విద్య,విజ్ఞాన, వినోద ,వికాసాలతో అజరామమై అద్వితీయమైన ఆర్థిక ప్రగతితో, ఆంధ్రులందరికి వైభవ చిహ్నం గా ప్రజా రాజధానిగా మన అమరావతి విలసిల్లుతుందని ఆశిస్తూ ... ఆచార్య కొడాలి శ్రీనివాస్

Comments

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని  అవగాహనారాహిత్యం  అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాల

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధి పోరాటాలకు ది

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ఉండటం కనిపిస్తుంది.  చరిత్ర