Skip to main content

నాయకులకు వాస్తు భయాలు

రాజుల సొమ్ము రాళ్ళ పాలు అని పాత మాట. ప్రజల సొమ్ము వాస్తు వశం అని నేటి మాట. తెలుగు రాష్ట్రాలను పాలించే నాయకులకు అధికారపీటం దక్కగానే వాస్తు భయాలు వెంటాడుతున్నాయి. నేతలలో వివేకం లోపించి విశ్వాసాలు చోటుచేసుకుంటున్నాయి. దినదిన గండం ఐదేళ్ళ పదవి అన్నట్లు వచ్చిన/దక్కిన పదవికి ఎక్కడ వెసరు వస్తుందో అన్న మీమాంస లేదా అర్దాంతర ఆపద వస్తుందోనని భయం... ఇలాంటి వారి ఆలోచనలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. 
ఈనాడు సౌజన్యంతో 
తెలంగాణ ముఖ్య మంత్రి KCR కు వాస్తు భయం పట్టుకుంది. ఆయనకు వాస్తు పిచ్చి ఉంటె వారి సొంత ఇంటికి అదీ చాలకపోతే తెరాస పార్టీ భవనంకు సరి చేసుకోవాలి.పిచ్చోడి చేతికి రాయి దొరికింది అన్నట్లు ఆయన వక్ర దృష్టి సచివాలయం పై పడింది. 
ఘన చరిత్ర ఉన్న రాష్ట్ర సచివాలయానికి వాస్తు బాగాలేదట. భయంకరమైన వాస్తు దోషం ఉందట. చరిత్ర చూస్తే 'గలీజు' ఉండి ఎ ముఖ్యమంత్రి ముందుకు పోలేదట. 
అందుకని 150 కోట్ల రూపాయలు పెట్టి ఎర్రగడ్డలో ఆసుపత్రిని కూలగొట్టి తనకు సరిపడే వాస్తు భవనం కడతాడట. 
ఇన్నాళ్ళు బాగున్న సచివాలయం వాస్తు ఇప్పుడు ఎందుకు బాగాలేదో వివరించాలి. గలీజు చరిత్ర వాస్తుతో పోతుందా?
ఒక వేళ సచివాలయం వాస్తు కుదరక రాష్ట్రం రెండు ముక్కలైనదా? లేక గలీజు రాజకీయంతో వీళ్ళు పోరాడింది ఏమైనా ఉందా?
వాస్తు దోషం ఉన్న దానిలో పరిపాలన ఉంటె బంగారు తెలంగాణా మూడు ముక్కలు అవుతుందనే భయమా ? 

అలాగే ఈ మధ్య ఆచార్య నాగర్జున విశ్వవిద్యాలయంలో ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు గారి కార్యక్రమం కుడా రెండు సార్లు అర్దాంతంగా వాయద పడటానికి కారణం వాస్తేనని గుంటూరులో చెవులు కొరుక్కుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.
రేపు ఈ ముఖ్యమంత్రులు కట్టే భవనాలు సింగపూరు ఆధునిక పద్దతులలో కడతారా లేక దేశవాళి వాస్తును బట్టి కడతారా? 
నేడు రాష్ట్రాల కి దశ దిశ నిర్దేశించవలిసిన నాయకులు ఇలా వాస్తు పేరుతో దిశలకు లొంగిపోవటం శోచనీయం. ఇంగిత జ్ఞానం కోరవడుతున్నది. కార్యా కారణాలు గురించిన వివేకం నశిస్తున్నది. 
ప్రమాణ స్వీకారం నుండి కార్యాలయం, అధికార నివాసం వరకు అన్నిటికి ముహూర్తాలు , వాస్తు సలహాలు పాటించటం చాల సర్వ సాదారణ విషయం గా మారింది. 
ముహూర్తాల వల్ల ప్రజా ధనానికి పెద్దగా దండుగ లేదు. కాని ప్రజా ధనం వాస్తు మరమ్మతులకు, కొత్త కట్టడాలకు దుర్వినియోగం అవటం శోచనీయం. 
అసలు వాస్తు విషయంలో మన ప్రజా ప్రభుత్వల పాలసీ ఏమిటో ఎవరికీ అర్థం కాదు.
ప్రభుత్వం నిర్మించే/వినియోగించే భవన,గృహల విషయంలో వాస్తు నియమాలు పాటిస్తుందా, పాటించదా?
ఒక వేళ పాటిస్తే, దేనిని ప్రమాణంగా తీసుకుంటారు?
ఇప్పుడు ఈ మార్పులు ఎందుకు అవసర మయ్యాయి?
వాస్తు కొరకు కొత్త భవనాలు కట్టవలిసిన అగత్యం ఎందుకు వచ్చింది? 
కాల క్రమేణా రాజకీయ పార్టీ లను బట్టి, సిద్దాన్తులను బట్టి వాస్తులో కూడా మార్పులు వస్తుంటాయా?
మనుషులను బట్టి, పదవులను బట్టి, సిద్దాన్తులను బట్టి వాస్తు మారుతుందా? వాస్తు వ్యక్తి గతమా ?
ప్రభుత్వానికి అధికార వాస్తు పండితుడు అంటూ ఎవరైనా ఉన్నారా?
ఉంటె,గింటే అతను దేన్నిప్రామాణికంగా వాస్తు చెబుతాడు? 
వాళ్ళు చెప్పే వాస్తు సలహాలు రోడ్లు,భవనాల శాఖ నియమావళికి అంటే సివిల్ ఇంజనీరింగ్ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయా? లేవా? 
భవిషత్తులో వచ్చే అన్నిరకాల అనర్ధాలకు, ఆర్దిక అగచాట్లకు ఇప్పుడు ముఖ్యమంత్రులకు సలహాలు/ సూచనలు ఇచ్చే వాస్తు సిద్దాంతి భాద్యత తీసుకుంటాడా?
ఒక వేళ ప్రభుత్వం వాస్తు పాటించదు అంటే , మరి ఏ నిబంధనల ప్రకారం పభుత్వ భవనాలకు వాస్తు మరమ్మతులు చేశారు?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే నాధుడు ఎవ్వడు?

Comments

Popular posts from this blog

అమరావతి - ఆవశ్యకత - 8

మోసం అనేది చాలీచాలని దుప్పటి వంటిది. తల కప్పుకుందామంటే కాళ్ళు, కాళ్ళు కప్పుకుందామంటే తల కనపడుతుంది. అమాయక రైతులను మోసం చేయటానికి, ఆలోచనాపరుల నుండి మద్దతు రాకుండా చేయటానికి అమరావతి పై సాంకేతిక విషయాలలో అయోమయాన్ని సృష్టించారు. 1. అమరావతిలో నేలలకు పటుత్వం తక్కువ అని, భారీ భవన నిర్మాణాలకు పనికి రాదని అంటూనే పునాదులకు ఖర్చు ఎక్కువ అని దుష్ప్రచారం చేశారు. సహజంగా నల్లరేగడి భూములకు పటుత్వం తక్కువగానే ఉంటుంది. సాధారణంగా ఇది ఒక చ.మీ కు 15 టన్నుల బేరింగ్ కెపాసిటి ఉంటుంది. ఎక్కడైనా అధిక అంతస్థుల భవన నిర్మాణంలలో పునాదులు లోతులోనే ఉంటాయి. అయితే అమరావతిలో భూమిలోపల ఆరు మీటర్ల లో దృఢమైన రాతి పలక ఉండటం చేత అది నిర్మాణాలకు అత్యంత అనుకూలంగా ఉందనేది వాస్తవం. పటుత్వం ఎక్కువ ఉన్న రాతినేలలు, గులక నేలలు ఉన్న చోట్ల పునాదులకు బ్లాస్టింగ్ ఖర్చు, రవాణా ఖర్చు ఎక్కువ. వీటితో పోల్చి చూస్తే అమరావతిలో పునాదులు అయ్యే వ్యయం ఒక చదరపు అడుగుకు షుమారుగా 200 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవదు. అమరావతికి ఉన్న ఇతర ప్రయోజనాలతో పోలిస్తే ఇది చాలా స్వల్ప మైనది. పునాదులకు ఎక్కువ ఖర్చు అనుకుంటే సాధారణ గృహాలను, 5 లేక 6 అంతస్థుల భవనాల...

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధ...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం...