Skip to main content

వాస్తు దోషాలు !!!

ఈ దేశానికే వాస్తు సరిగా లేదని, అందుకే మనకిన్ని కష్టాలని ఓ వాస్తు విద్వాంసుడు (వి ద్వంసుడు) సెలవిస్తున్నాడు. మరొకడు రాష్ట్రానికి, ఇంకొకడు జిల్లాలకు, వేరొకడు ఊరికి వాస్తు బాగాలేదని అంటుంటే, ఇప్పుడు పార్టీ గెలుపు ఓటమిలకు కుడా వాస్తు పనిచేస్తుందని మాయ చేస్తున్నారు.
ఇలా గృహ వాస్తు రోజురోజుకి ముదిరి అనేక రంగాలలోకి దూరిపోతున్నది. దేశానికి అంటుకున్న ఈ వాస్తు తెగులుకు మందు వేయాలి, లేకుంటే జాతి నష్టపోయే ప్రమాదం ఉంది. 

ఇది ఇలాఉంటే ... ఆడలేని అమ్మ మద్దెల ఓడు అన్నట్లు, తెలుగు దేశం పార్టీ నేతలు రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవటానికి పార్టీ ఆఫీసు ఎన్.టి.ఆర్. భవన్ కు వాస్తు బాగా లేనందువల్లెనని తీర్మానించి వాస్తు మరమ్మత్తులు మొదలెట్టారు. ఇంతకు ముందు కుడా ఇలానే చాలా సార్లు పార్టీ కార్యాలయాలకు వాస్తు చికిత్సలు చేసి చేతులు కాల్చు కున్నా బుద్ది రాలేదు. అధికారంలోకి రావటానికి ప్రజలను నమ్ముకుంటే ఫలితం వుంటుందే గాని వాస్తును నమ్ముకుంటే పార్టీ నశించి పోవటంఖాయం.విజన్ 2020 అంటూ మొదలు పెట్టి మూఢ నమ్మకాలలో కాలక్షేపం చేయటం ఎంత వరకు సబబో పార్టీ శ్రేణులుకొంచం ఆలోచించాలి.
 
నిరాశ, నిస్పృహలు ప్రవేశించినప్పుడు వివేకం సన్నగిల్లటం సహజం.ఇలాంటి సమయంలోనే విజ్ఞతచూపాలి. ఈ నాటి దేశ రాజకీయాలలో అబద్రతా భావం పెచ్చు మీరి రాజకీయ నాయకులు వాస్తు, గ్రహ బలాలను పట్టుకు వ్రేలాడుతున్నారు. అధికారంలో ఉన్నవారైతే మరీను. ప్రభుత్వ ఆఫీసు లకు,క్వార్టర్స్ కు వాస్తు పేరుతొ రిపేర్లు చేస్తూ ప్రజా ధనం వృధా చేస్తున్నారు. వీరిని చూసి ఎందరో సామాన్య జనం కుడా వాస్తు దోషాల పేరుతో వారి కాలాన్ని,ధనాన్ని పోగొట్టుకుంటున్నారు.

ఒక లెక్క ప్రకారం వాస్తు పేరుతొ ఈ దేశంలో షుమారుగా ఏటా ఒక వెయ్యి కోట్లు రూపాయలు వృధా అవుతుందని అంచన. ఈ డబ్బుని ప్రజోప పనులకు ఉపయోగపడితే ఎంత బాగుండు. పదుగురికి మార్గనిర్దేశం చేసేవారు,ప్రజలలో పలుకుబడి/హోదా వుండేవారు,డబ్బు, డాబు వుండే పెద్దలు .. వీరు నడిచే పద్దతిని బట్టి, చేసే పనులను బట్టి ఇలాంటి చిల్లర,మల్లర వాస్తుపనులకు ఆదరణ లభిస్తున్నది. 

అలాగే ఎలక్షన్లలో గెలవటానికి యజ్ఞాలు,యాగాలు చేసే ప్రభుద్దులు, ఇళ్ళకి వాస్తు,పనులకు ముహూర్తాలు,వర్జాలు చూచుకొనే ప్రజా నాయకులకు ఈ దేశంలో కొదవలేదు. దశా నిర్దేశం చేయాలిసిన మన నాయకులు "కుక్క తోకను పట్టుకొని .." దేశాన్ని నడిపిస్తాం అంటుంటే ..చేసేది ఏమి లేదని తల పట్టుకొని కుర్చోవాల, లేక వాళ్ళని కుర్చీలో నుండి దించాలా? వేమన అన్నట్లు 'బుద్ది చెప్పువాడు గుద్దితేనేమి' అని వారికి బుద్ధి రావటానికి మనమేం చేయాలో ఆలోచించండి !!!

Comments

శుభ వార్త !!!
వాస్తు బాగోలేదని ప్రభుత్వ భవనాలను మరమ్మత్తులు చేయించడానికి, లేదా కూలగొట్టి మళ్ళి కట్టడానికి అవసరమైన ఖర్చును ప్రభుత్వ ఖజానా నుండి కేటాయించరాదని,అలా చేయడం ప్రజా ధనాన్ని దుర్వినియోగ పరచడమే అవుతుందని ప్రజా సంఘాల నాయకులు శ్రీ ఇన్నయ్య గారి నాయకత్వంలో ది 13 జూన్,2009 న రాష్ట్ర ఆర్ధిక మంత్రి శ్రీ కే.రోశయ్య గారికి వినతి పత్రం ఇచ్చారు. వినతి పత్రం పరిసిలించిన రోశయ్యగారు వాస్తుపేరుతో ప్రభుత్వ ధనం వృధాఅవుతున్న మాట నిజమేనని, ఇక పై అలా జరగకుండా అన్ని విభాగాలకు ఆదేశాలు జారి చేస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి గారి ఆదేశాలు ఎంత వరుకు అమలు జరుగుతాయో చూద్దాం.

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని  అవగాహనారాహిత్యం  అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాల

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధి పోరాటాలకు ది

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ఉండటం కనిపిస్తుంది.  చరిత్ర