చేఎత్తి జే కొట్టు తెలుగోడా , గతమెంతో ఘనకీర్తి గలవోడా .. అనే ప్రబోధ గీతం తో ఒకనాడు నిద్రాణస్థితి నుండి మేల్కొన్న జాతి , ఆత్మ గౌరవనినాదంతో కదం తొక్కిన తెలుగు జాతి విభజనతో దగాపడితే ఆత్మవిశ్వాసం కలిగించి అభిమానంతో ఆప్యాయంగా అక్కున చేర్చుకొన్ననేలఅమరావతి. ఇది బుద్దిమాధవ్యం గలవారికి భ్రమరావతిగా కనిపించవచ్చు.అలాంటి వారి భ్రమలు తొలగి సౌమ్య అమరావతిగా నూతన తేజస్సుతో నవ్యఆంధ్ర రాజధానిగా అవతరిస్తుంది. ఆంద్ర జాతి ఉన్నంతవరకు అమరావతి శాశ్వితంగా ఉండటానికి ఉపకరిస్తున్న అనేక సాంఘిక, ఆర్థిక కారణాలతో పాటు రాజకీయ, నైసర్గిక, నైతిక విషయాలు ప్రస్తావించుకుందాం. 1. రవాణా సదుపాయాలు a) విజయవాడ లో 1888 లో ప్రాంభించబడి దాదాపు 132 సంవత్సరాల నుండి సేవలందిస్తున్న అతి పేద్ద రైల్వే కూడలి ఉంది. 22 ట్రాక్స్ తో ,10 ఫ్లాట్ ఫార్మ్స్ నుండి ప్రతి రోజు 1.5 లక్షల ప్రయాణికులకు సేవచేస్తూ దేశంలోనే 4వ అతి పెద్ద స్టేషన్ గా విలసిల్లుతుంది. b) రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులకు సేవలందించి 2003లో పౌర విమానాశ్రయంగా మారి దినదినాభివృద్ధి చెందుతున్న గన్నవరం విమానాశ్రయం జోడవటం అమరావతికి కలిసివచ్చిన అంశం. c) జాతీయ రహదారులు NH - 16,( చెన్నై-కల...
వాస్తు శాస్త్రం అనేది ప్రాచిన కాలంలో మన దేశం లో ఉద్బవించిన నివాసాల నిర్మాణ శాస్త్రం. అదే నేడు సివిల్ ఇంజనీరింగ్ గా ప్రసిద్ది చెందినది. కాని నేడు వాస్తు పేరుతొ అనేక అవాస్తవాలు,అతిశయాలు,ఆశలు,భయాలు చెలామణిలో ఉన్నాయి. వీటిని పరిశీలించి వాస్తవాలను భహిర్గతం చేయాలన్నదే నా ఆశయం.